నవదీప్ ను టార్గెట్ చేసిన సుధీర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో టీవీ ఛానెళ్లు టీఆర్పీ రేటింగులను పెంచుకోవడం కోసం కాంట్రవర్సీలను సృష్టిస్తున్నాయి.

ప్రోగ్రామ్ లలో పాల్గొనే వారి మధ్య శృతి మించిన పంచ్ డైలాగులు పెడుతున్నాయి.

ఆ డైలాగుల వల్ల ఫ్యాన్స్ తాము అభిమానించే వ్యక్తిపై పంచ్ డైలాగులు వేసిన వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.తాజాగా సుధీర్ ఫ్యాన్స్ నవదీప్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రోగ్రామ్ లో భాగంగా నవదీప్ పంచ్ లు వేయడంతో అతనిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.మరికొన్ని రోజుల్లో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ఈటీవీ ఛానల్ నిర్వాహకులు "అక్కా ఎవరే అతగాడు" పేరుతో స్పెషల్ ఈవెంట్ ను కండక్ట్ చేస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్ లో నవదీప్ "గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారని స్టేడియంలో సిక్స్ కొట్టేవారికే ఒక రేంజ్ ఉంటుంది" అని చెబుతాడు.సుధీర్ వెంటనే " మన రేంజ్ ఏంటో తెలుసా.?" అని చెప్పగా నవదీప్ వెంటనే "సోదాపు.! దమ్ముంటే నన్నాపు" అని పంచ్ వేస్తాడు.

Advertisement

ఈ షో అంతా స్క్రిప్టెడ్ అయినప్పటికీ నవదీప్ సుధీర్ ను అవమానించే విధంగా పంచ్ వేయడంతో సోషల్ మీడియాలో ఒక గ్రూపుగా ఉన్న సుధీర్ ఫ్యాన్స్ నవదీప్ ను టార్గెట్ చేసి హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నవదీప్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అర్థం చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.గతంలో సుధీర్ ఫ్యాన్స్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ను కూడా ఇదే విధంగా ట్రోల్ చేశారు.

సుధీర్ ఫ్యాన్స్ నవదీప్ కంటే ప్రస్తుతం సుధీర్ కే క్రేజ్ ఎక్కువగా ఉందని.అతనిని అవమానించే విధంగా పంచ్ లు వేయడం సరికాదని చెబుతున్నారు.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బుల్లితెరపై సుధీర్ ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు.అయితే మరి కొంతమంది నవదీప్ సరదాగా చెప్పాడే తప్ప సుధీర్ ను అవమానించే విధంగా అందులో ఏం లేదని కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు