ఆ యంగ్ హీరో చనిపోయి సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ కేసు మాత్రం తేలలేదు.... 

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరిగ్గా ఏడాది క్రితం పలు మానసిక ఒత్తిడులను మరియు వృత్తి పరమైన సమస్యలను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురించి అందరికీ తెలిసిందే.

కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు మరణానికి కారణం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రియా చక్రవర్తి అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రియా చక్రవర్తి ని పోలీసులు అరెస్టు చేసి దాదాపుగా ఎనిమిది నెలలపాటు కస్టడీలో ఉంచి విచారణ చేశారు.

కాగా ఇటీవలే రియా చక్రవర్తి బెయిల్ పై విడుదల అయ్యింది.అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఏడాదికి పైగా కావస్తున్నప్పటికీ అసలు సుశాంత్ సింగ్  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మరియు అతడు ఆత్మహత్యకు కారణమైన వారు ఎవరనే విషయాల గురించి మాత్రం ఇప్పటికీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు పోలీసులు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనికితోడు ఇటీవలే రియా చక్రవర్తి ని మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రకటించడంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు మరోమారు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవలే సుశాంత్ సింగ్ మరణించి సంవత్సరం కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు మరియు అభిమానులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మకు శాంతి కలగాలని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  తో గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం రియా చక్రవర్తి అని అప్పట్లో తీవ్ర అభియోగాలు వినిపించాయి.అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి రియా చక్రవర్తి మాదక ద్రవ్యాల వినియోగించే అలవాటు చేసిందని కూడా సుశాంత్ సింగ్ తల్లిదండ్రులు ఆరోపించారు.ఏదేమైనప్పటికీ  ఓ బలహీన క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యంగ్ హీరో అకాల మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు