సర్కారు వారి పాట పాడేది అప్పుడే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న మహేష్, తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంకా మొదలుపెట్టలేదు.

అయితే ఇటీవల సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.కానీ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే సూచనలు కనిపిండం లేదు.

దీంతో ఈ సినిమాను పరిస్థితులు చక్కబడ్డాకే మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో నటిస్తుండగా మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఆర్ధిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోండగా ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.14 రీల్స్‌ ప్లస్‌ మరియు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమా సెప్టెంబర్ నెలలో షూటింగ్ మొదలుపెట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు