సామ్ సంగ్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిన్న సోమవారం అనగా జనవరి 2వ తేదీన ఒడిస్సీ, వ్యూఫినిటీ, మరియు స్మార్ట్ మానిటర్ లైనప్లలో కొత్త మోడళ్లను పరిచయం చేసింది.
అల్ట్రా - వైడ్ డిస్ప్లే విభాగంలో, దక్షిణ కొరియా తయారీ కంపెనీ ఒడిస్సీ నియో G9ని ఆవిష్కరించింది.
ఇది డ్యూయల్ అల్ట్రా - HD రిజల్యూషన్తో వచ్చిన ప్రపంచంలోని మొట్ట మొదటి సింగిల్ మానిటర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.అదనంగా, సామ్ సంగ్ ఒడిస్సీ OLED G9 కర్వ్డ్ డిస్ప్లే మానిటర్ను 5,120 x 2,880 పిక్సెల్ల రిజల్యూషన్తో ViewFinity S9 5K మానిటర్ను పరిచయం చేస్తోంది.
అయితే సామ్ సంగ్ తాజా మానిటర్ల ధర మాత్రం ఇంకా వెల్లడించలేదు.
1.కొత్తగా ఆవిష్కరించబడిన సామ్ సంగ్ Odyssey Neo G9 గేమింగ్ మానిటర్ మోడల్ పేరు G95NC.2.7,680×2,160 పిక్సెల్ల రిజల్యూషన్ కలిగి వుంది.3.240Hz రిఫ్రెష్ రేట్ మరియు 32:9 యాస్పెక్ట్ రేషియో.4.57-అంగుళాల 1000R కర్వ్డ్ డిస్ప్లే.5.DisplayPort 2.1 మద్దతును కలిగి ఉంటుంది.
1.మోడల్ నంబర్ G95SC 2.డ్యూయల్ క్వాడ్-HD 49-అంగుళాల 1800R కర్వ్డ్ డిస్ప్లే 3.32:9 యాస్పెక్ట్ రేషియో, 0.1ms ప్రతిస్పందన సమయం మరియు 240Hz రిఫ్రెష్ రేట్.4.OLED డిస్ప్లే ప్రతి పిక్సెల్ 1,000,000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో కలిగి వుంది.5.గేమింగ్ హబ్ ఆన్బోర్డ్తో వస్తుంది.6.Xbox క్లౌడ్ గేమింగ్ మరియు Nvidia GeForce Now క్లౌడ్లో గేమ్స్ సపోర్ట్.
మరిన్ని వివరాలకు సామ్ సంగ్ సంబంధిత సైట్ సందర్శించగలరు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy