చిత్రలహరితో హిట్ గ్యారెంటీ అంటున్న సాయి ధరమ్ తేజ్

వరుసగా రెండు హ్యాట్రిక్ డిజాస్టర్స్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చిత్రలహరి.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మూడు విభిన్న వ్యక్తిత్వాలు వారి మధ్య పరిచయం, ప్రేమ అనే కోణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుంటుంది.

ఎలా అయిన ఈ సారి హిట్ కొట్టాలనే కసితో ఉన్న తేజ్ కి చిత్రలహరి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ నేపధ్యంలో సినిమా హిట్ పై తేజ్ భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

నివేతా పెతురాజ్, కల్యాణి ప్రియదర్శి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక అతని గత సినిమాల ట్రాక్ ప్రకారం చూసుకుంటే ఇది కచ్చితంగా ఓ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో నడిచే చిత్రం అవుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా సక్సెస్ కోసం ట్రై చేసిన తేజ్ కి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రలహరి ఎ మేరకు సక్సెస్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఏప్రిల్ 12న రాబోతున్న ఈ సినిమాపై తేజ్ మాత్రం గట్టిగా ఆశలు పెట్టుకున్నాడని చెప్పొచ్చు.

Advertisement
స్పిరిట్ సినిమాతో ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా..?

తాజా వార్తలు