కరోనా వైరస్ పేరుతో ఆర్జీవీ సినిమా... ట్రైలర్ ఈ రోజే

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎం చేసిన భిన్నంగా చేస్తాడు అనే అభిప్రాయం జనాలలో ఉంది.

దానికి తగ్గట్లే ప్రతి అంశాన్ని సినిమా కథాంశంగా మార్చుకొని జనాల మీదకి వదలడంలో ఆర్జీవీ ముందు ఉంటాడు.

అలాగే వివాదాలని కూడా తన సినిమా కథలుగా వాడేసుకుంటాడు.ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది.

గత రెండు నెలలుగా లాక్ డౌన్ లో ప్రజలందరూ భయం భయంగా బ్రతికారు.మరల ఇప్పుడిప్పుడే కరోనా ఉన్న కూడా భయాన్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చి స్వేచ్చగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ కరోనా కష్టాన్ని ఆర్జీవీ తన సినిమా కథగా మార్చేసుకున్నాడు.కరోనా వైరస్ పేరిట కొత్త చిత్రం తీసినట్టు తాజాగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Advertisement

ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కాలంలోనే తెరకెక్కించానని వెల్లడించారు.తాజాగా ఈ సినిమా నుంచి ఓ పిక్ ను షేర్ చేశారు.

కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం ఇలా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.ఆ పిక్ లో దంపతులు బెడ్రూంలో కూడా మాస్కులు ధరించి ఎంతో ఎడంగా కూర్చుని ఉండడం చూడొచ్చు.

మొత్తమ్మీద వర్మ సినిమా తీయడమే కాదు ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు.ఈ రోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.

మొత్తానికి కరోనా లాక్ డౌన్ టైంలో సినిమా షూటింగ్ లు అన్ని బంద్ చేసి అందరూ ఇంట్లో కూర్చుంటే ఆర్జీవీ మాత్రం ఈ టైంలో కూడా హ్యాపీగా షూటింగ్ చేసుకోవడం విశేషం.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు