విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!!

టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైసిపి సీనియర్ నేత విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ మాట్లాడుతూ కేసు కోర్టు పరిధిలో ఉందని ఏదైనా న్యాయస్థానం చూసుకుంటుందని తెలిపారు.

 Rewanth Reddy Made Sensational Comments On Vijayasai Reddy  Vijayasai Reddy ,rew-TeluguStop.com

అదే రీతిలో ఈ కేసుకు సంబంధించి ఏదైనా వివరణ ఇవ్వాలని అది న్యాయస్థానానికి ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు.ఇంక నా కేసుల గురించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి పై 2011 సంవత్సరంలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కేసుల గురించి విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు విమర్శలు చేస్తుంటే ఎంతగానో నవ్వు వస్తుందని రేవంత్ సెటైర్లు వేశారు.

ఒకరిని విమర్శించే ముందు వారి మొఖం అద్దంలో చూసుకోవాలి అని హితవు పలికారు.

విజయసాయి రెడ్డి పై ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎక్కడెక్కడ నమోదయ్యాయి కనీసం ఆయనకు కూడా తెలియదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో తనపై విమర్శలు చేసిన వైఎస్ షర్మిలపై కూడా రేవంత్ విమర్శలు చేయడం జరిగింది.

టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్లు రేవంత్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టార్టింగ్ లో రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని ఈ క్రమంలో కౌంటర్లు వేశారు.ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చాలామంది పార్టీలు మారడం జరిగింది అని అదే విధంగా తాను పార్టీలో మారి ప్రజలలో ఎంపీగా గెలిచి వారి అభిమానులు సంపాదించి అధిష్టానం ఆశీస్సులు అందుకనే టీపీసీసీ చీఫ్ పదవిని అందుకోవటం జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube