మస్కట్ లో రోడ్డు ప్రమాదం... రుద్రంగి వాసి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రానికి చెందిన కురుమ మల్లేశం (41 ) మార్చ్ 15 న మస్కట్ ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కురుమ మల్లేశం బ్రతుకు దేరువు కోసం మస్కట్ వెళ్లగా సరైన జీతం లేక గత సంవత్సరం కంపెనీ నుండి కలివెల్లి అయి తోచిన పని చేసుకుంటూ ఉండగా అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రుద్రంగి కుటుంబ సభ్యులకు మరణ వార్త బుధవారం తెలిసినట్లు సమాచారం.మృతదేహాన్ని రుద్రంగి తెప్పించేందుకు రెండు లక్షల ఖర్చు అవుతాయిని, తమది బీద కుటుంబం అని అంతా డబ్బు పెట్టి తెప్పించుకునే స్తోమత లేదని ప్రభుత్వం ఆదుకొని చివరి చూపు కలిగేలా చూడాలని ప్రభుత్వన్నీ వేడుకుంటున్నారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

Latest Rajanna Sircilla News