ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్..!!

ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది.ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు పోటా పోటీగా జరగనున్నాయి.

సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో అధికార పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనుంది.మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన చేపట్టనుంది.

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ పాల్గొని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయనున్నారు.ఒకేసారి రెండు పార్టీలకు చెందిన కార్యక్రమాలు ఉండటంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు