పిట్ట కథ హీరోయిన్ ఎవరో తెలుసా...

అప్పట్లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించినటువంటి "దేవుళ్ళు" అనే చిత్రం ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే ఉంటుంది.

ఈ చిత్రం సంగీత పరంగా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రంలో విడిపోవాలనుకునే తమా తల్లిదండ్రులను కలిపేందుకు ఇద్దరు చిన్నారులు చేసేటువంటి ప్రయత్నాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.అయితే ఈ ఇద్దరి చిన్నారుల్లో ఒకరైన టువంటి నిత్య శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అడపాదడపా చిత్రాలు చేస్తోంది.

అయితే నిత్యా శెట్టి దేవుళ్ళు సినిమాలో నటించిననంతరం తన చదువు నిమిత్తమై దాదాపుగా పదేళ్లకు పైగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంది.అంతేకాక బాగా చదువుకొని మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది.

అయితే తాను చేస్తున్న ఉద్యోగం నచ్చక సినీ పరిశ్రమ వైపు మనసు మళ్లడంతో మళ్లీ టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.వచ్చిరాగానే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల నటించిన "నువ్వు తోపురా" అనే చిత్రంలో నటించింది.

Advertisement

ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఊరుకొండ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఇక్కడ కూడా ఈ అమ్మడికి సరైన హిట్ లేక పోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకొలేకపోయింది.అయితే తాజాగా చందు ముద్దు దర్శకత్వం వహించినటువంటి ఓ పిట్ట కథ అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం ప్రేక్షకుల్ని థియేటర్లలో బాగానే ఆకట్టుకున్నప్పటికీ వసూళ్ళను మాత్రం రాబట్టలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు