లూసిఫర్ కోసం మరోసారి నయనతారకి ఒకే చెప్పిన మెగాస్టార్

సౌత్ ఇండియన్ విమెన్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నయనతార.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కెరియర్ ఆరంభంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో తన హవా కొనసాగిస్తుంది.

లేడీ ఒరియాంటెడ్ సినిమాలతో స్టార్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా నయనతార అక్కడ తన బ్రాండ్ ని కొనసాగిస్తుంది.ఇదిలా ఉండగా నయనతార కోలీవుడ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టాలీవుడ్ ని పలకరించి పోతుంది.

ఇక్కడ చేస్తున్న సినిమాలు కూడా స్టార్ హీరోల పక్కనే కావడం విశేషం.టాలీవుడ్ నుంచి ఫీమేల్ సెంట్రిక్ కథలు ఆమెకి వినిపించేవారు ఎవరూ లేరు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల కోసం మాత్రమే నయనతారని సంప్రదిస్తున్నారు.ఈమె చివరిగా తెలుగులో సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవికి జోడీగా నటించింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఆమె చిరంజీవితో జత కట్టడానికి రెడీ అవుతుంది.చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.ఇందులో చిరంజీవికి జోడీగా నయనతారని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.

ఒరిజినల్ కథలో మోహన్ లాల్ కి జోడీగా హీరోయిన్ ఉండదు.అయితే ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి, మెగా ఫ్యాన్స్ ని దృష్టిలో చిరంజీవికి హీరోయిన్ ని పెట్టినట్లు, అలాగే వారి మధ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ప్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు