బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్

బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

కిషన్ రెడ్డి అవహేళనగా మాట్లాడటం సరికాదని చెప్పారు.హైదరాబాద్ కు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారా అని మంత్రి తలసాని ప్రశ్నించారు.నాలుగేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్న ఆయన బీజేపీ నేతలు వ్యవస్థలను సైతం అవమానిస్తున్నారని విమర్శించారు.

ఫాం హౌజ్ కేసులో బీజేపీనే కోర్టుకు వెళ్లిందని తెలిపారు.ఈ కేసులో ఆడియో, వీడియో అబద్ధమా అని ప్రశ్నించిన తలసాని కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యనించారు.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు