ఖమ్మం జిల్లాలో జోరుగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు.. శ్రేణులను అభినందించిన సీఎల్పీ లీడర్ భట్టి

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది.

పార్టీ సభ్యత నమోదు కార్య్రమంలో ఉత్సాహంగా పనిచేసిన పార్టీ శ్రేణులను శాసనసభ కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క అభినందించారు.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు పూర్తి అవుతుంది.ఖమ్మం నగర పాలక సంస్థ మాజీ కార్పొరేటర్, అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యర్రం బాల గంగాధర్ తిలక్ నేతృత్వంలో గాంధీ చౌక్ లో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులను భట్టి ఖమ్మం లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.పార్టీ పటిష్టత కోసం కష్టించి పనిచేసే శ్రేణులకు కాంగ్రెస్ పార్టీలో కచ్చితంగా సముచిత గౌరవం లభిస్తుందని ఆయన తెలిపారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేయాలని విక్రమార్క పిలుపునిచ్చారు.బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా సాగిందని భట్టి ప్రశంసించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , నగర అధ్యక్షులు జావిద్ , జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య , కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .

వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?
Advertisement

Latest Khammam News