భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేట, బాకురుపల్లె, దేవుని గుట్ట తండా పలు గ్రామాల్లో యోగ ఆసనాలు వేసి యోగా దినోత్సవం నిర్వహించినట్లు బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలతో శారీరక దృఢత్వం మానసిక వికాసం సొంతం యోగ ప్రక్రియతోనె మానసిక వికాసం ప్రశాంతత సాధ్యమని, సమస్త ప్రపంచం విశ్వసించిందని ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలతో ఆరోగ్యం కాపాడుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేవూరి దేవేందర్ రెడ్డి, బంధారపు లక్ష్మారెడ్డి,గణేష్ రమేష్,మెడిశేట్టి బాలయ్య, గుర్రాల రాజు,గడ్డం రవి, నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News