ఈ పిచ్చి నిర్ణయాల బదులు సినిమాలకు గుడ్‌ బై చెపొచ్చుగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఇటీవలే రూలర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

జై సింహా చిత్రంతో తనకు డిజాస్టర్‌ ఇచ్చిన ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలోనే రూలర్‌ చిత్రాన్ని బాలయ్య చేయడం జరిగింది.

తక్కువ గ్యాప్‌లోనే ఒకే దర్శకుడితో రెండు డిజాస్టర్స్‌ చేసిన ఘనత బాలయ్యకే దక్కింది అంటూ విమర్శలు వస్తున్నాయి.ఒక సారి ఫెయిల్యూర్‌ ఇస్తే ఆ దర్శకుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కాని బాలయ్య మాత్రం తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలు ఆయన పాలిట శాపం అవుతుంది.రూలర్‌ చిత్రంతో బాలయ్య నిర్ణయాల స్థాయి ఏంటో తెలిసి పోయింది.

అసలు రూలర్‌ చిత్రం ఎంతటి దారుణమైన పరాజయం పాలయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటి సమయంలో బాలయ్య కొత్త సినిమాల విషయంలో చాలా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

కాని అవే పిచ్చి అడుగులు అవే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ స్వయంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఒకప్పుడు బి గోపాల్‌ గొప్ప దర్శకుడు అనే విషయం తెల్సిందే.కాని ఇప్పుడు ఆయన్ను పట్టించుకునే నాధుడే లేడు.అలాంటి దర్శకుడి చేతిలో ఒక సినిమాను బాలయ్య పెట్టబోతున్నాడట.

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచికి పూర్తి విరుద్దంగా ఆయన సినిమాలు ఉంటాయనే టాక్‌ ఉంది.అలాంటి దర్శకుడితో ఎందుకు బాలయ్య సినిమా అంటూ విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న బాలయ్య ఆ తర్వాత బి గోపాల్‌ దర్శకత్వంలో చేస్తాడట.అది కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?

బాలయ్య స్పీడ్‌ బాగానే ఉంది కాని, సినిమాలే బాగాలేవు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు