చావు నుంచి తృటిలో బయటపడ్డాను... విశాల్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ యంగ్ హీరో విశాల్( Vishal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఈయన తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నారు.

ఇక విశాల్ నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.ఇక ఈ మధ్యకాలంలో విశాల్ తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

గత రెండు రోజులుగా ఈయన హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవమని విశాల్ ఖండించారు.ఇకపోతే తాజాగా ఈయన మార్క్ ఆంటోనీ( Mark Antony ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ఈనెల 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఇందులో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య ( S.J Suriya )నటిస్తున్నారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Advertisement

ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విశాల్ ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగినటువంటి ప్రమాదం గురించి తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు.

చావు నుంచి తృతిలో తప్పించుకున్నానని ఆ భయం నుంచి తాను పదినిమిషాల పాటు తేరుకోలేకపోయానని తెలియజేశారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని పూర్తిచేసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పెద్ద ట్రక్ తన వైపు చాలా వేగంగా దూసుకు వచ్చింది అయితే దానిని గమనించిన నేను ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నాను.దీంతో ఆ ట్రక్ సెట్ ను ఢీకొనడంతో సెట్ మొత్తం కూలిపోయిందని తెలిపారు.అది చూసిన నాకు ఒక పది నిమిషాల పాటు నోట మాట రాలేదని ఈ ప్రమాదం నుంచి తాను బయటపడటం అంటే ఇది నాకు పునర్జన్మ లాంటిది అంటూ ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈయన పలు సినిమాలో షూటింగ్ సమయంలో ఇలా ఎన్నోసార్లు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు