హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతిని పునస్కరించుకొని శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ భక్త ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు.హనుమాన్ దేవాలయాలు లేని గ్రామాలు లేవని ఆ స్వామి వారు గ్రామస్తులకు ఎలాంటి కీడు జరగకుండా భూత ప్రేత పిశాచాలను పారదోలే విధంగా గ్రామానికి ధైర్యాన్ని కల్పిస్తారు అన్నారు.

ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
Advertisement

Latest Rajanna Sircilla News