ఢిల్లీ లిక్కర్ కేసులో గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్వాం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఇటీవల అరెస్ట్ అయిన సీఏ గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.

దీంతో గోరంట్లను రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట అధికారులు హాజరుపరిచారు.కేసు దర్యాప్తు పురోగతిని వివరించిన సీబీఐ కస్టడీని పొడిగించాలని కోరింది.

ఈ నేపథ్యంలో సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు