డే కేర్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే డే కేర్ సెంటర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.

డైనింగ్ హాల్ ,వంట రూం ,తదితర గదులను పరిశీలించారు.

డే కేర్ సెంటర్ లో ప్యూరి పైడ్ మిషన్ ను అమర్చాలని జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ డి ఈ ని ఆదేశించారు.డే కేర్ సెంటర్ లో అవసరమగు బెంచీ లను ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు జిల్లా కలెక్టర్ ను కోరగా తక్షణమే బెంచీలు తెప్పించాలని అధికారులను.

ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్,పంచాయతీరాజ్ అధికారులు,సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు తోట అగయ్య , జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు,మండల తహసీల్దార్ జయంత్ కుమార్ ,ఎంపీ డి ఓ బింగి చిరంజీవి, ఏ పి ఓ కొమురయ్య తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

Latest Latest News - Telugu News