మోడీ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన సిపిఐ రామకృష్ణ..!!

సిపిఐ రామకృష్ణ ప్రస్తుతం దేశంలో ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులకు కారణం ప్రధాని మోడీ అని సీరియస్ కామెంట్లు చేశారు.గతంలో కరోనా వచ్చిన ప్రారంభంలో.

ఇండియా లో వైరస్ విస్తరించకుండా ప్రధాని మోడీ యే కారణమని బీజేపీ నాయకులు గొప్పలు గర్వంగా చెప్పుకున్నారు.  మరి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వైఫల్యానికి కారణం ఎవరు.? మోడీయే అంటూ రామకృష్ణ తీవ్రస్థాయిలో కేంద్రంపై బిజెపి పార్టీ పై మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఎన్నికలు నిర్వహించడంతోపాటు కుంభమేళ నిర్వహించటం వల్ల దేశంలో 50 శాతం కేసులు నమోదు అయ్యాయి అని అన్నారు.

మోడీకి ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యము అన్నట్టు ముందు చూపు లేకుండా పని చేశారని, అసలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించడం ఏంటి అని నిలదీశారు.దేశంలో పరిస్థితి చూస్తే గంగానదిలో డెడ్ బాడీ లు తేలుతున్నాయి అని మండిపడ్డారు.

మోడీ ప్రధాని గా ఉండటానికి అనర్హుడు అని వేరే వాళ్ళు ఆ స్థానంలో కూర్చోవాలని రామకృష్ణ కాంట్రవర్సి కామెంట్లు చేశారు.ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ తో పాటు చంద్రబాబు నాయుడు మోడీకి భయపడుతున్నారని.

Advertisement

ప్రశ్నించే ధైర్యం కూడా లేదంటూ సిపిఐ రామకృష్ణ విమర్శించారు.   .

ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 
Advertisement

తాజా వార్తలు