ఘనంగా దళిత వైతాళికులు,సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం దళిత వైతాళికులు,సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతులైన బాగ్యా రెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భాగ్యరెడ్డి వర్మ ఒక గొప్ప సంఘ సంస్కర్త, దళితు వైతాళికుడు అని కొనియాడారు.

స్వాతంత్ర్యంకు ముందు దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు.భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.

హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వేల మంది విద్యార్థులకు విద్య అందించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని కొనియాడారు.స్వాతంత్య్ర రాక ముందే సమాజంలో నెలకొని ఉన్న అనేక సామాజిక వివక్షత లు, అసమానతలు, మూడ నమ్మకాల పై గళ మెత్తి పోరాటం చేశారని కొనియాడారు.

Advertisement

జోగిని,దేవదాసి వ్యవస్థలపై పోరాటం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవికుమార్, అడ్మినిస్ట్రేషన్ అధికారి హమ్మదుల్లా ఖాన్, కార్యాలయా సిబ్బంది పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News