ట్రైలర్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన భీమ్లా.. ఇక తగ్గేదేలే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా గుంరించే ప్రస్తుతం అందరు మాట్లాడు కుంటూ ఉన్నారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుంది.

పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.భీమ్లా నాయక్ సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పాన్ ఇండియా సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ కోసం రేస్ నుండి తప్పుకుంది.

ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది.మరి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని అన్నింటిని సిద్ధం చేసుకుంటున్నారు.

రిలీజ్ మరొక మూడు రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Advertisement

ఈ ట్రైలర్ కు ఊహించని స్పందన వచ్చింది.రాత్రికి రాత్రే ఏకంగా 7 మిలియన్ వ్యూస్ సాధించింది.

దీంతో టాలీవుడ్ లో అతివేగంగా 8 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్ గా భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డ్ సృష్టించింది.ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినా సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక మరొక మూడు రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం జోరుగా స్టార్ట్ అయ్యాయి.ఇక నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగాల్సి ఉండగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

మరొక మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఇక మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తారా లేదా అనే సందేహం ఫ్యాన్స్ కు కలుగుతుంది.అయితే ఈ నెల 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూఢ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Advertisement

తాజా వార్తలు