భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురుసు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన నాగవంశీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నోటి దురుసు కారణంగా బహిరంగంగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలు ఈయన అభిమానులకు క్షమాపణలు ఎందుకు చెప్పారు అనే విషయానికి వస్తే.యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీ.జే టిల్లు సినిమా ఫిబ్రవరి 12వ తేదీ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకొని మంచి విజయాన్ని తన సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం కావడంతో చిత్రబృందం వైజాగ్ లో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాగ వంశీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Advertisement

ఇక ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులను ఏకవచనంతో వాడు వీడు అంటూ సంబోధించారు.ఇక సినిమాకి మరో ప్రాణం అయిన ప్రేక్షకులను పట్టుకుని ఇలాంటి మాటలు అనడంతో ఈ విషయం పట్ల అభిమానులు కాస్త మొహం చిన్నబుచ్చుకున్నారనే వార్తసోషల్ మీడియా ద్వారా తెలియడంతో ఈ విషయంపై స్పందించిన నాగ వంశీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన రాస్తూ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో అభిమానం.ఏ నిర్మాణసంస్థ కైనా బలం ప్రేక్షకులే.ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బు మించిన వినోదాన్ని అందించామన్న ఆనందంలో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పొరపాటున ప్రేక్షకులను ఏకవచనంతో మాట్లాడినందుకు బాధపడ్డారనే విషయం తన వరకు వచ్చిందని ఈ విషయంపై తాను కూడా బాధపడుతూ బహిరంగంగా ప్రేక్షకులకు క్షమాపణ చెబుతున్నట్లు తెలియజేశారు.

కేవలం సోదరభావంతోనే అలా ఏకవచనంతో సంబోధించి మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు.మొత్తానికి ఈయన నోటిదురుసు కారణంగా అభిమానులకు ఇలా బహిరంగంగా క్షమాపణలు చెప్పుకొచ్చారు.ఈ నిర్మాణంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు