ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ కి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కింది.

గ్రామంలో పలు అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు ల కమిటీ పరిశీలించింది.

కాగా అవార్డు ను సోమవారం మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అందుకున్నారు.తాను అవార్డు అందుకోవడం కోసం సహకరించిన గ్రామ ప్రజలకు,పాలకవర్గ సభ్యులకు,అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

అవార్డు తీసుకునే కార్యక్రమం లో సర్పంచ్ వెంట ఎంపీపీ పిల్లి రేణుక యాదవ్,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఎంపిడిఓ చిరంజీవి,మండల పంచాయతీ అధికారి వజీర్,గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ ఉన్నారు.

వీడియో: కోర్టులో డివోర్స్ కేసు నడుస్తుండగా భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి..
Advertisement

Latest Rajanna Sircilla News