బిసి కుల జనగణనను వెంటనే రాష్ట్రంలో చేపట్టాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ బీసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల బిసి భవన్ లో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై మాట్లాడుతూ కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం బిసి లపై చిన్న చూపు చూస్తున్నది అని అన్నారు.

బిసి కుల జనగణన ను వెంటనే రాష్ట్రంలో చేపట్టాలని అని డిమాండ్ చేశారు.బిసి బిడ్డ దేశ ప్రధాని గా వుండి బిసి కుల జనగణన చెయ్యకపోవడం బాధ కరం అని అన్నారు.

దేశ వ్యాప్తంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జజుల శ్రీనివాస్ గౌడ్ న్యాయకత్వం లో బిసి కుల జనగణన కోసం అన్ని పార్టీలతో అన్ని రాష్ట్రలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చరించారు.రాష్ట్రంలో అన్ని పార్టీలను కలుపుకొని మరింత ఉదృతం చేస్తామని రానున్న రోజుల్లో బిసి ల సత్తా ఏంటో చూపిస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం బిసి కుల జనగణన కోసం అసెంబ్లీ లో తీర్మానం చెయ్యాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే కుల జనగణన కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్,బిసి హాస్టల్ ఇంచార్జీ నవీన్, పట్టణ అధ్యక్షులు రుద్రవేని సుజాత,నాయకులు తరుణ్, రాహుల్,పవన్, విజయ్,వినాయక్, కార్తీక్,మణికంఠ, మనోజ్,పానవ్, లోకేష్, సాయి ప్రితం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News