టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తున్నారు.
ఈ దీక్షకు సత్యమేవ జయతే అనే పేరును పెట్టారు.
అయ్యా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితో మీరు ఉన్నట్టా లేనట్టా అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు అన్నారు.
గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు నిజామాబాద్ కు వస్తున్నారని , నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణకు రానున్నారు.
ఈనెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టిటిడి అధికారులు ఏర్పాటు చేశారు.
గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సాదాలు చేస్తున్నారు.హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆరు చోట్ల సాధాలు నిర్వహిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర నేడు మచిలీపట్నంలో కొనసాగుతోంది.
టిడిపి అధినేత చంద్రబాబు జైలులో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని ప్రధానమంత్రి నరేంద్ర మోది పై కేటీఆర్ విమర్శలు చేశారు.
హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనిని , సినీ నటుడు, టిడిపి సీనియర్ నేత మురళీమోహన్ అన్నారు.
పాలమూరులో బ్రదర్ నరేంద్ర మోడీ పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు తెలంగాణ పట్ల మోది వివక్ష చూపిస్తున్నారని, నరేంద్ర మోది కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానమంత్రి అని రేవంత్ ప్రశ్నించారు.
కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకస్మాత్తుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టిడిపి మాజీ మంత్రి పొంగులేటి నారాయణ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.నాలుగో తేదీన విచారణకు హాజరు కావలసిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టారు.
ములుగు జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం పాలెం పాత్రాపురం గ్రామ శివారులలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి గిరిజన సంఘాల ఐక్యవేదిక పేరుతో కరపత్రాలు వెలిశాయి.
దసరా పండుగ సందర్భంగా సంస్థలు వెళ్లేందుకు హైదరాబాదు నుంచి 5265 ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy