గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1938 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సవరణలు తీసుకు వచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
టెట్ పరీక్షలు రాసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తెలంగాణలో టెట్ పరీక్షలను వీలైనంత తొందరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది అని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేసారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోంది అని సంజయ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇవ్వలేదా అని ఏపీ టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు సూటిగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి పరిటాల సునీత ఆయన తనయుడు శ్రీరామ్ మరో 39 మంది టిడిపి నేతలపై పోలీస్ కేసు నమోదు అయ్యింది.30 పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడం తో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం పై రాప్తాడు ఏ ఎస్ ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ , ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2022 సెట్ షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
తిరుపతి నగరం లో జనసేన కార్యకర్తల పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.
నిన్న రాత్రి జనసేన కార్యకర్త రాజేష్ నాయక్, శేఖర్ రెడ్డి పై ఇమ్రాన్ , ఇర్భాన్ లు దాడి చేశారు.ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ గా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ను జిల్లా కేంద్రం చేయాలంటూ ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 303 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై బి ఎస్ పి రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.చార్జీల పెంపు సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ నాంపల్లి కోర్టు జారీ చేసింది.గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు , హార్డింగ్ లను చించివేయడం పై విచారణ చేపట్టిన కోర్టు ఎంపీ అరవింద్ విచారణకు హాజరు కాకపోవడం పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోది ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
శ్రీశైలంలో నేటినుంచి సర్ప దర్శనం జరుగనుంది.ఈ నెల 30 వరకు జరుగుతుంది.
శ్రీకాకుళం లో నేడు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ట్రిపులార్ మూవీ రిలీజ్ సందర్భంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,950 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,310 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy