మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
అలాగే మరికొంతమంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే కొంతమంది భక్తులు స్వామి వారికి తల నిలాలను సమర్పించి మొక్కలను చెల్లించుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే భక్తులు దైవదర్శనానికి రావాలంటే ముందుగా దర్శనం టికెట్( Darshan Ticket ) తీసుకొని రావాల్సి ఉంటుంది.
![Telugu Rupees, Annavaram, Kakinada, Tirumala-Latest News - Telugu Telugu Rupees, Annavaram, Kakinada, Tirumala-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/10/annavaram-temple-special-darshan-ticket-increased-to-300-rupees-detailsa.jpg)
అలాగే మన దేశంలో ఉన్న ఆలయాలలో భక్తులకు అందుబాటులోనే టికెట్ల ధరలు ఉంటాయి.కానీ అన్నవరంలో( Annavaram ) ప్రత్యేక దర్శనం టికెట్ల విషయంలో భక్తులకు షాక్ తగిలింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే అన్నవరంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధరను 300 పెంచుతున్నట్లు దేవాలయం ముఖ్య అధికారులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ప్రదక్షిణ ప్రత్యేక దర్శనం టికెట్లను 300 పెంచుతున్నట్లు ప్రకటించారు.ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త ధర అమల్లోకి వస్తాయని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.
![Telugu Rupees, Annavaram, Kakinada, Tirumala-Latest News - Telugu Telugu Rupees, Annavaram, Kakinada, Tirumala-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/10/annavaram-temple-special-darshan-ticket-increased-to-300-rupees-detailsd.jpg)
ఇంకా చెప్పాలంటే ప్రధాన దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ బంగారు కల్ప వృక్షం, బంగారు కామధేను, బంగారు హుండీ, బంగారు గంధపు గిన్నెలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా వెల్లడించారు.అయితే తిరుమల శ్రీవారి భక్తులకు( Tirumala Devotees ) శుభవార్త అని చెప్పవచ్చు.ఇప్పటినుంచి క్యూ లైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకోనే అవకాశం భక్తులకు కల్పించామని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.అలాగే నిన్న భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉండడం వల్ల తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారని దేవాలయం ముఖ్య అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న ఒక రోజు దాదాపు 72,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
LATEST NEWS - TELUGU