ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్లుగా సద్దుమణిగిన మూడు రాజధానుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
గుంటూరు జిల్లా పెదకాకాని వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో 3 రాజధానుల బిల్లు తీసుకొస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.రాజధాని వికేంద్రీకరణ జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని జగన్ అన్నారు.
వైసీపీ ప్లీనరీలో పరిపాలన వికేంద్రీకరణ.పారదర్శకత అనే తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాల్ని కాపాడడంతో పాటు వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.ఈ విషయంపై రాజ్యాంగం ప్రకారం న్యాయసలహా తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
మూడు రాజధానులపై భవిష్యత్తులో మరింత మెరుగైన చట్టాన్ని తీసుకొస్తామని అప్పుడే వెల్లడించారు.రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా మూడు రాజధానులు ఇస్తామంటున్నాం.
అందులో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నాం.కానీ, చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టయం కొనుగోలు చేసిన బినామీ భూముల రేట్ల కోసం తమకు అడ్డుపడుతున్నారని జగన్ తాజాగా వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి.
మూడు ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవం ఉంది.అలా చేస్తే బాబు అండ్ కో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దెబ్బ పడుతుందని కుట్రలకు తెర లేపుతున్నారంటూ సీఎం జగన్ విమర్శించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.తాత్కాలికంగా అసెంబ్లీతోపాటు సెక్రటేరియట్ కూడా అక్కడ నిర్మించారు.హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది.ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుండి పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
దాంతో, మూడు రాజధానుల అంశంపై అమరావతి కేంద్రంగా ఆందోళనలు వెల్లువెత్తాయి.జగన్ ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు భగ్గుమన్నారు.
అప్పటి నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.కొత్త చట్టం తీసుకొస్తామని జగన్ ప్రభుత్వం తెలిపింది.
అదే విషయాన్ని జగన్ పునరుద్ఘాటించడంతో మరోసారి మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది.
అమరావతిలో అసెంబ్లీని కొనసాగిస్తూ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది జగన్ ప్రభుత్వ ప్రణాళిక.విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటు చేసి ఆ నగరాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్ యోచించారు.అందుకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం గతంలో తెచ్చిన రాజధానుల బిల్లులో లొసుగులున్నాయిని భావించి దానిని రద్దు చేశారు.
దాంతో, కొత్త బిల్లును రాజ్యాంగపరంగా చెల్లుబాటయ్యేలా తేవాలని న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy