ఇండియాలో కరోనా వైరస్ ఎంటర్ అయిన నాటి నుండి ఎక్కువగా నమోదైన కేసులు మహారాష్ట్రలో అని అందరికీ తెలుసు.దేశంలో మొదటి లో చాలా రాష్ట్రాలలో వైరస్ కంట్రోల్లోకి వచ్చిన కానీ మహారాష్ట్రలో మాత్రం అదుపులోకి తీసుకు రానీ పరిస్థితి అప్పట్లో నెలకొంది.
ఈ విషయంలో కేంద్రం కూడా టెన్షన్ పడటం జరిగింది.
అయితే ఆ తర్వాత రానురాను పరిస్థితి మారడం ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ని లైట్ తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
ఇలాంటి తరుణంలో మళ్లీ మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తిరగబడి నట్లు దీంతో… లాక్ డౌన్ చేపట్టే ఆలోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రెండు రోజులలో ఏకంగా రాష్ట్రంలో కొత్తగా 5427 కరోనా కేసులు నమోదు కావడంతో మహారాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది.
ముఖ్యంగా అమరావతి జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో. ఆ ప్రాంతంలో లాక్ డౌన్ చేపట్టింది.