తనకు సంబంధం లేకపోయినా అండగా నిలిచిన షకీలా.. మంచి మనస్సు చాటుకుంటూ?

ఒకప్పుడు బోల్డ్ సినిమాల ద్వారా వార్తల్లో నిలిచిన షకీలా( Shakila ) ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.

అయితే షకీలాకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

అయితే షకీలా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నా గతంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.తాజాగా షకీలా ఒక మంచి పని చేయడం ద్వారా వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయ్యారు.

తాజాగా కష్టాల్లో ఉన్న కొంతమందికి షకీలా తన వంతు సహాయం చేయడం జరిగింది.షకీలా సినిమాలకు దూరంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరంగా లేరు.ఇతర ప్రధాన నగరాలతో పోల్చి చూస్తే చెన్నైలో లివింగ్ కాస్ట్ ఎక్కువనే సంగతి తెలిసిందే.

చెన్నైలో చిత్ర రెసిడెన్షియల్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ పేరుతో ఒక కాంప్లెక్స్ ఉండగా ఆ అపార్టుమెంట్ కు సంబంధించి యాజమాన్యం 9,000 రూపాయలు మెయింటనెన్స్ కట్టాలని కోరింది.అయితే ఆ మొత్తం చెల్లించడం సులువు కాదని, అక్రమంగా యాజమాన్యం డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదని భావించిన అపార్టుమెంట్ వాసులు ఆ డబ్బులు చెల్లించలేదు.

Advertisement

డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన యాజమాన్యం ఆ అపార్టుమెంట్ కు నీటి సరఫరా బంద్ చేసింది.ఈ విషయం షకీలా దృష్టికి రావడంతో ఆమె వాళ్లకు అండగా నిలబడటం ద్వారా వార్తల్లో నిలిచారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ ఈ తరహా ఘటనలకు సంబంధించి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు.కానీ షకీలా మాత్రం ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా అడుగులు వేస్తూ ముందుకెళుతున్నారు.షకీలా కూడా వాళ్లతో కలిసి నిరసన తెలుపుతుండగా ఆమె జోక్యంతో సమస్య పరిష్కారం అవుతుందేమో చూడాలి.

షకీలా మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు