వర్షంలో తడిస్తే నా జుట్టు తడిచిపోతుంది: ట్రంప్

అదేంటో మరి.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడిన జనాలను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ట్రంప్ మాట్లాడిన ఓ మాటా నెట్టింట వైరల్ అవుతుంది.అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాల్ చల్ అవుతున్నాయ్.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన అమెరికా నౌకాదళ సైనికులను ఫ్రాన్స్‌లోని డబ్ల్యూడబ్ల్యూఐ స్మశానవాటికలో ఖననం చేశారు.

అయితే ఆ సమాధులను చూసేందుకు ట్రాంప్ ఏమాత్రం ఇష్టపడలేదట.అది మాత్రమే కాదు ఓడిపోయినా వారు పిరికి పందలు అని.వారిని అతను చూడనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట.ఇక దీనికి సంబంధించి అట్లాంటిక్ పత్రిక నిన్న ఒక నివేదిక వెల్లడించింది.

Advertisement

ఇక మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 2018లో పారిస్ సమీపంలోని ఐస్నే-మార్న్ అమెరికన్ స్మశానవాటికను సందర్శించేందుకు ట్రంప్ నిరాకరించినట్టు, దానికి కారణం అతని జుట్టు వర్షంలో తడిచిపోతుందనే భయంతో ఆలా చేసినట్టు అందులో ఉంది.అయితే ఈ విషయంపై ట్రంప్ సహాయకులు స్పందిస్తూ.

వాతావరణం బాగాలేదని అందుకే హెలికాప్టర్‌ అక్కడికి వెళ్లలేదని అయన తెలిపారు.ఏది ఏమైనప్పటికి ట్రంప్ కు నోటి దురుసు అనే విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే.

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి నెట్టింట వైరల్ అవుతుంటారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు