మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటించారు.

ఓ ప్రేవేటు కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన తుమ్మలకు, ఆయన అనుచరులు, అభిమానులు,కార్యకర్తలు భారీ కాన్వాయ్ తో అపూర్వ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అభిమానులు,కార్యకర్తలతో తుమ్మల మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ, రాజకీయా ద్రోహులను నమ్మొద్దన్నారు.

శత్రువులు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఓటు వేసుకుంటారు.కానీ, ద్రోహులు మాత్రం ఉన్నపార్టీనే ఒడిస్తారన్నారు.

ద్రోహులను కనిపెట్టే బాధ్యత మిదేనని, నేను తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్థానన్నారు.జిల్లాతో పాటు, పాలేరు నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామి గా నిలిపానన్నారు.

Advertisement

మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్తి చేయిస్తానన్నారు.మీరు చూపిస్తున్న ఆదరణ, అపూర్వ స్వాగతానికి జీవితాంతం ఋణపడి ఉంటానన్నారు.

కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Latest Khammam News