పవన్ పెళ్లాలను మార్చుకోవడానికే రాజకీయాలకు పనికిరాడు

అమరావతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా పవన్ రోడ్డు మీదే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్యెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో పవన్ పై మండిపడ్డారు.వేషాలు మార్చుకోవడానికి, రంగులు మార్చుకోవడానికి చివరకి పెళ్లాలను మార్చుకోవడానికి పవన్ పనికి వస్తున్నారు తప్ప రాజకీయాలకు మాత్రం పవన్ పనికి రాడు అంటూ పవన్ పై జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఒక పార్టీ అధినేత గా ఉన్న పవన్ రెండు చోట్ల పోటీ చేయడమే కాకుండా ఓటమి చెందిన పవన్ పిచ్చి తుగ్లక్ లా మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడు 150 కాదు అవసరమైతే అంతకంటే ఎక్కువ గెలుస్తాం.

చంద్రబాబు పాలనలో నాలుగేళ్ల పాటు ఏం చేశారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.ఓ ముల్లు గుచ్చుకుంటే పారిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ జోగి విమర్శించారు.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు