రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy ) మరోసారి విమర్శలు గుప్పించారు.

ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టిందని పేర్కొన్నారు.

ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఏలేటి మండిపడ్డారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు,( Harish Rao ) సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) డ్రామాలో చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలను అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న ఏలేటి రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు