సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్టుకొని రావణుడితో మాట్లాడింది ఎందుకు?

రావణాసురుడిని గడ్డి పోచగా భావించడం వల్ల.అందుకే అలా అడ్డుగా పెట్టుకొని మాట్లాడింది.

కాముకుడితో స్త్రీ నేరుగా మాట్లాడరాదు కాబట్టి.కుల స్త్రీలూ, పతివ్రతలు పరాయి మగవాడితో మాట్లాడ రాదు గనుక.

తనను కనులతో కూడా చూసే యోగ్యత రావణుడికి సిద్ధించకూడదని.గతంలో శ్రీరాముడు గడ్డిపోచతోనే కాకిని నిరసించాడని తనూ అలాగే నిరసిస్తున్నానని.

తనకి దగ్గరిగా ఉన్నాడు గానీ, ఏదో ఒకటి అడ్డుగా ఉండాలని.హనుమంతుడు సీతాన్వేషణకై లంకకు పోయి అశోక వనంలో ఆమెను చూస్తాడు.

Advertisement

అతడు ఆమెతో కలసి మాట్లాడక ముందే ఆనాటి వేకువను రావణాసురుడు సీత చెంతకు వచ్చి తన్ను వరించవలసినదిగా అభ్యర్థిస్తాడు.రావణుని మాటలువిన్న సీత దుఃఖిస్తూ, భయంతో వణకుతూ, భర్తనే మనస్సులో భావిస్తూ ఒక గడ్డిపోచను రావణునికీ, తనకూ మధ్యలో వుంచి అతనికి సమాధానం చెప్పింది.అలా తృణాన్ని అడ్డు పెట్టుకోవడానికి వ్యాఖ్యా తలు అనేక కారణాలు చెప్పారు.1.దుష్టుడైన రావణాసురునితో నేరుగా మాట్లాడడం తగదు.2.పరపురుషుని ముఖం చూడరాదు.3.చింది.4.నేను చెప్పేమాటను నీ రావణుణ్ణి ఆ విడు తృణీకరిస్తా భావిం భావన.5.తన కటాక్షపాత యోగ్యత అతనికి సిద్ధించగూడదు.6.రాముడు పూర్వం తృణంతో కాకిని నిరసించినాడు, అట్లే నేను వీణ్ణి నిరసిస్తునన్నభావన.7.సమీపంలోవున్నా వానికీ, నాకూ మధ్య ఏదో వ్యవధానంగా ఉండాలి.8.అతనికి తృణమే భోగ్యం.9.ఈ తృణాన్ని నేను ఛేదించినట్లే పశుతుల్యుడైన అ నిన్ను రాముడు ఛేదిస్తాడు.10.అచేతనాన్ని చేతనం కావించిసంబోధించి మాట్లాడుతున్నానన్న భావన.ఇలా అనేకాంశాలు ఇందులో ఉన్నాయని వ్యాఖ్యాతలు విశదీకరించారు.

Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know
Advertisement