వైరల్: మరదలు పిల్ల వలే.. రా బావ తిని చూడు అంటున్న హోటల్ యజమానులు..!

కరోనా  వైరస్ ఎంట్రీ ఇవ్వక ముందు అన్ని రకాల వ్యాపార సంస్థలు చాలా సజావుగా కొనసాగేవి.

ఒక్కసారిగా కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో లాక్ డౌన్ ప్రవేశపెట్టడంతో ఒక్క సారిగా అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపారాలు తలకిందులు అయిపోయాయి.

ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమం భారతదేశంలో ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి విధితమే.ఇది ఇలా ఉండగా ప్రజలు హోటల్స్, రెస్టారెంట్స్ పై మొగ్గు చూపడం కాస్త తగ్గిందనే చెప్పాలి.

అంతేకాకుండా ఎంతో మంది బయట ఫుడ్ తినాలి అంటే చాలా భయానికి లోనవుతున్నారు.మరో వైపు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులు వివిధ రకాల ప్రయత్నాలు, ఆఫర్లు ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనా గాని ఎవరికి వారు వారి ప్రత్యేకత చూపించుకోవాలనే తెగ ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియాలో మరొక హోటల్ కు సంబంధించిన పేరు మాత్రం వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఇంతకీ ఆ హోటల్ పేరు ఏమిటి అని ఆలోచిస్తున్నారా రా బావ తిని చూడు అని నామకరణం చేశారు.

Advertisement

అయితే ఆ హోటల్ ఎక్కడ ఉందో ఏమో తెలియదు కానీ ఆ హోటల్ పేరు మాత్రం మన తెలుగులోనే ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్రాంతంలో ఉంటుందని అర్థమవుతుంది.ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ మాత్రం ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతూ వైరల్ చేస్తూన్నారు.

మరి కొంతమంది అయితే కేవలం పిలవడం వరకేనా మరి బిల్లు ఏమాత్రం వేస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో హోటల్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోటల్ యాజమాన్యాలు ప్రయత్నాలు ఒక విధంగా సక్సెస్ సాదించాయనే  చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు