టాలీవుడ్ లో రాబోతున్న త్రీక్వెల్ సినిమాస్ ఇవే..?!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ రావడం అనేది చాలా అరుదుగా జరిగేది.

ఆ సీక్వెల్ అనేది ఫస్ట్ సినిమాకి న్యాయం చేయలేకపోయింది అనే మాటలు వినిపించేవి.

నిర్మాతలు కూడా ఎక్కువగా డబ్బులు పెట్టేవారు కాదు.ఆ సినిమా బాగుంది కదా ఇది కూడా చూస్తారులే, మినిమం గ్యారంటీ అని సినిమాలు తీసేవారు కానీ రాజమౌళి తర్వాత సీక్వెల్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తూ డబ్బులు భారీగా ఖర్చు చేస్తున్నారు.

ప్రస్తుతాన్ని ఈ సీక్వెల్స్ ట్రెండే నడుస్తోంది.అయితే కొన్ని సినిమాలు త్రీక్వెల్ ట్రెండ్ ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి.

అంటే ఈ సినిమాలకు మూడవ పార్ట్స్‌ రూపొందించబోతున్నారన్నమాట.ఆ సినిమాలేవో తెలుసుకుందాం పదండి.

కార్తికేయ

Advertisement

హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ) హీరోగా వచ్చినా కార్తికేయ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దాని తర్వాత కార్తికేయ 2 కూడా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.కార్తికేయ 2 సినిమా( Karthikeya 2 ) 2022లో మిస్టరీ యాక్షన్-అడ్వెంచర్ మూవీగా తెరకెక్కింది.చందూ మొండేటి చేసిన ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.15 కోట్లు.వసూలు చేసింది మాత్రం రూ.117 కోట్లు. భారతదేశవ్యాప్తంగా ఈ సినిమా అఖండ విజయం సాధించింది.

ఈ మూవీ పెండింగ్లో ఇంకొక పార్ట్ ఉండబోతుందన్నట్లు ఓ క్లూ ఇచ్చారు.అంతేకాదు ఇప్పుడు కార్తికేయ త్రీక్వెల్ పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ మూవీ ఇంకెంత బాగుంటుందో అని ప్రేక్షకులు హైప్స్ పెంచేసుకుంటున్నారు.

కాంతార

"వరాహ రూపం దైవ వారిష్టం" పాటతో కాంతార సినిమా( Kantara ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమా చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది కాబట్టి అన్నిచోట్ల కూడా భారీ ఎత్తున కలెక్షన్లను రాబట్టింది.జస్ట్ రూ.16 కోట్లు బడ్జెట్ పెడితే రూ.450 కోట్ల దాకా వసూళ్లు కలెక్ట్ చేసింది.అయితే ఈ మూవీ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి( Rishab Shetty ) ఫస్ట్ పార్ట్ లో పెద్దగా కంటెంట్ చూపించింది ఏమీలేదని, అందుకే సెకండ్ పార్ట్ తీసి భూత కోల అనే ఆరాధన పద్ధతిని చక్కగా చూపిద్దామని ప్లాన్ చేశాడు.

మేకర్స్ కూడా ఆ సెకండ్ పార్ట్ కు కావలసిన బడ్జెట్ అందిస్తున్నారు.అయితే థర్డ్ పార్ట్ కూడా తీస్తున్నట్లు తెలుస్తోంది దాంతో ఇవన్నీ ఎలా ఉండబోతాయో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పొలిమేర

తెలుగు లో ఈ ఇద్దరు దర్శకులకు మాత్రమే 100% సక్సెస్ రేట్ ఉందా..?
స్టార్ హీరో ప్రభాస్ కే ఎందుకిలా.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ లోటు ఉండిపోయిందా?

సత్యం రాజేష్( Satyam Rajesh ) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ "పొలిమేర" సినిమా( Polimera ) అనూహ్యంగా భారీ హిట్ సాధించింది.కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది ఇది.అయితే దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ కూడా తీశారు.పొలిమేర 2 కూడా మంచి హిట్ అయింది.

Advertisement

దాంతో థర్డ్ పార్ట్‌ తీసేందుకు సిద్ధమయ్యారు.అనిల్ విశ్వనాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సత్యం రాజేష్ తన పాత్రను మళ్ళీ పోషిస్తారు.

బాలాదిత్య కూడా ఇందులో కనిపించనున్నారు.

తాజా వార్తలు