కాంగ్రెస్ పార్టీలో చేరిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణ మూర్తి..

ఎల్లారెడ్డి పేట మండలంలో క్రియాశీలకంగా ఎదిగిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణ మూర్తి కాంగ్రెస్ పార్టీ లో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

మొదట ఈనాడు విలేఖరిగా పనిచేసిన కృష్ణమూర్తి సమాజంలో మంచి పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు.

అనంతరం బీజేపీ పార్టీలో చేరిన కృష్ణ మూర్తి బీజేపీ పార్టీ నుండి జెడ్పీటీసీ గా పోటీ చేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి గా పనిచేశారు.

తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.ఇటీవల బిఆర్ఎస్ పార్టీ కి ఆంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కృష్ణ మూర్తి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని ఊహాగానాలు వెలువడుతున్న కానీ బిఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదు.

గతంలో కృష్ణ మూర్తి కి ఇప్పటి ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు 2008 నుండి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ సంబంధాల నేపథ్యంలోనే కృష్ణ మూర్తి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News