దేశానికి కావాలి సిపాయి గ్రామానికి కావాలి సఫాయి. మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సయ్య గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) గంభీరావుపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో ఎనిమిదవ రోజుకు చేరు సమ్మెకు మద్దతు తెలిపిన మా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సయ్య గౌడ్.

నర్సగౌడ్( Narsaiah Goud ) మాట్లాడుతూ, దేశానికి కావాలి సిపాయి గ్రామానికి కావాలి సఫాయి అని వారు చేస్తున్న సేవలను కొనియాడారు.చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ, కరోనా మహమ్మారి విపత్కర సమయంలో కూడా ప్రాణాల సైతం లెక్కచేయకుండా వీళ్ళు చేసిన సేవలను మహోన్నతమైనవని ఆయన అన్నారు.గ్రామపంచాయతీ కార్మికుల( Gram panchayat workers)లో ఎక్కువగా దళితులు బీసీ అనగారిక వర్గాల వారే పనిచేస్తున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని వారు అడుగుతున్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్లు నర్సాగౌడ్ , వారు గురువారం రోజున చేస్తున్న భాగంగా వారికి 5000 రూపాయల విరాళాన్ని అందించారు నర్సాగౌడ్.

Latest Rajanna Sircilla News