జాన్వీ కపూర్ పై తెలుగు ప్రేక్షకులు సీరియస్.. కారణమేంటంటే?

అలనాటి తార అభిమానులంతా ఎంతో ఇష్టంగా పిలుచుకునే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.

ప్రెసెంట్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తుంది.

ఇప్పటికే ఈ బ్యూటీ కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఈ అమ్మడికి కమర్షియల్ హిట్ అయితే ఒక్కటి కూడా రాలేదు.

/br>దీంతో ఆమె గట్టిగానే ప్రయత్నిస్తుంది.ఒక్క కమర్షియల్ హిట్ పడితే కెరీర్ స్పీడ్ అందుకుంటుంది అని ఆశగా ఎదురు చూస్తుంది.

అయితే తాజాగా ఈమెపై మన తెలుగు ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.ఈమె చేసే పని ఎంతమాత్రం నచ్చడం లేదు.

Advertisement

గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో నటింపచేయాలని మన దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈమె వరుసగా నో చెప్పుకుంటూ పోతుంది./br>

ఈ అమ్మడు కేవలం బాలీవుడ్ మీదనే ఫోకస్ పెట్టింది.తండ్రి బోనీ కపూర్ నుండి పలువురు ఫిలిం మేకర్స్ జాన్వీ కపూర్ ను ఒప్పించే ప్రయత్నాలు చేసిన కూడా ఈమె మాత్రం కమిట్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు.తాజాగా బోయపాటి కూడా రామ్ సినిమా కోసం ఈమెను సంప్రదించే ప్రయత్నాలు చేసారు కానీ ఈమె స్క్రిప్ట్ కూడా వినకుండానే నో చెప్పేసిందట.

సౌత్ సినిమా పరిశ్రమను ముఖ్యంగా తెలుగు సినిమాలను జాన్వీ కపూర్ అవమానించినట్టుగా వ్యవహరిస్తోంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఇప్పుడు తెలుగు సినిమా కూడా ఏ మాత్రం తీసిపోదు.అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు.

ఇటీవల కాలంలో వారే నటించాలని ఉందని ఓపెన్ గా చెబుతున్నారు.కానీ ఈమె మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడంతో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు