సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆ నిర్మాతకు నిద్రలేని రాత్రులు

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో చాలా మార్పులు వచ్చాయి.

ప్రస్తుతానికి ఆ మార్పులు కంటికి కనిపించకున్నా కూడా పద్ధతులు ఇంకా ప్రవర్తన అందరిలో కూడా మారింది.

ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.గతంలో నెలకోటి, రెండు నెలలు ఒకటి చొప్పున సినిమాలు ప్రకటిస్తూ వచ్చిన కరణ్ ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదంటున్నారు.

సుశాంత్ మరణం కు పరోక్షంగా చాలా మంది కారణం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో కరణ్ జోహార్ మరింతగా టార్గెట్ అయ్యాడు.

సోషల్ మీడియాలో ఆయన్ను ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాంతో ఆయన వారసుల పిల్లలతో సినిమాలు చేయాలనే ఆలోచన తీసేశాడట.

Advertisement

ఇక సుశాంత్ మరణం తర్వాత విమర్శల కారణంగా ఎన్నో నిద్ర లేని రాత్రులను ఆయన గడిపాదట.

ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కరణ్ జోహార్ ఈ స్థాయిలో ఇబ్బంది పడటం ఇదే ప్రధమం అంటున్నారు.ప్రస్తుతం సినిమాలు పూర్తిగా ఆపేసి పిల్లలతో ఈ లాక్ డౌన్ టైం ను కరణ్ గడుపుతున్నాడని, అలా ట్రోల్స్ నుండి బయటపడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు