అద్దెకు సుశాంత్ సింగ్ ఇల్లు.. ధర ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఆయన అభిమానులను కలచివేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన జరిగి సంవత్సరం అయినప్పటికీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని ఆయన అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

సుశాంత్ జీవించి ఉంటే స్టార్ హీరోగా మరింత ఉన్నతస్థాయికి ఎదగడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఉండేవారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

2020 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన బాంద్రాలోని అపార్టుమెంట్ లో సుశాంత్ సింగ్ మరణించిన సంగతి తెలిసిందే.సుశాంత్ మృతి తరువాత సంవత్సర కాలంగా ఆ భవనం ఖాళీగా ఉంది.సుశాంత్ జీవించి ఉన్న సమయంలో ఆ భవనానికి నెలకు నాలుగున్నర లక్షల రూపాయల చొప్పున అద్దె చెల్లించేవారు.

ఆ భవనం ఓనర్లు తాజాగా ఆ భవనాన్ని అద్దెకు ఇస్తామని మాట ఇచ్చారు.నెలకు 4 లక్షల రూపాయల అద్దె ఖరారు చేశారు.ఎవరైతే ఆసక్తి ఉండి నెలకు 4 లక్షల రూపాయల అద్దె చెల్లించే స్థోమత ఉంటే ఆ భవనాన్ని అద్దెకు తీసుకోవచ్చు.

Advertisement

సుశాంత్ సింగ్ ఈ భవనాన్ని లీజుకు తీసుకోగా నిబంధనల ప్రకారం 2022 సంవత్సరం డిసెంబర్ నెలతో లీజు గడువు ముగియనుంది.సుశాంత్ మరణం వల్ల భవనం ఖాళీగా ఉండటంతో యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సుశాంత్ అభిమానులు మాత్రం ఆయన జీవించి ఉంటే బాగుండేదని తలచుకుంటున్నారు.

సుశాంత్ మృతి చెంది ఏడాది కావడంతో సోషల్ మీడియాలో సుశాంత్ మృతికి అసలు కారణాన్ని తేల్చాలనే కామెంట్లు వినిపించాయి.మరి సుశాంత్ ఆత్మహత్యకు అసలు కారణాలు ఎప్పటికి వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.సుశాంత్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఆమె సోదరుడు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

రియా చక్రవర్తి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు