పాన్ షాప్ పెట్టి చదివించాను.. ఎన్నో మాటలు పడ్డాను అంటూ సిరి తల్లి కన్నీళ్లు?

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కంటెస్టెంట్ లో ఫ్యామిలీ రాకతో బిగ్ బాస్ ఇల్లంతా సందడిగా మారిపోయింది.

ఈ క్రమంలోనే పలువురు కంటెస్టెంట్ లు తమ కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ కూడా అయ్యారు.

నిన్నటి ఎపిసోడ్ లో కాజల్ కు సంబంధించి తన భర్త కూతురు ఎంట్రీ ఇవ్వడం తో కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అనంతరం మానస్ తల్లి, సన్నీ తల్లీ ఎంట్రీ ఇచ్చారు.

మానస్ మదర్ అందరితో జాలిగా కలిసిపోయింది.ఈ క్రమంలోనే సిరి, షణ్ముఖ్ ల హగ్గు లపై కౌంటర్లు వేసింది.

అనంతరం కాజల్, రవి పై సెటైర్ వేసింది.ఆ తర్వాత కంటెస్టెంట్ సిరి తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

సిరి గురించి తల్లి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.అనంతరం సిరి, షణ్ముఖ జస్వంత్ ఇచ్చుకునే హగ్గులు, ముద్దులు తనకు నచ్చలేదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

సిరి అలా చేయడం తనకు నచ్చలేదని సిరి తల్లి ముఖం మీద చెప్పేసింది.అనంతరం సిరి మదర్ తాను పడ్డ కష్టాలు గురించి చెప్పింది.సిరి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు.

ఆ తర్వాత పాన్ షాప్ పెట్టి చదివించాను. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు అంటూ ఎమోషనల్ అయ్యింది.

అనంతరం ఎన్నో కష్టాల తర్వాత ఇక్కడ వరకు వచ్చింది నాకు గర్వంగా ఉంది ఇప్పుడు అందరూ సిరి వాళ్ళ అమ్మ అని అంటున్నారు అంటూ గర్వంగా చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు