బీజేపీ "ప్రజాగ్రహ" సభపై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్...!!

ఏపీ బీజేపీ నిన్న విజయవాడలో నిర్వహించిన ప్రజా గ్రహ సభ రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది.

ఏపీ బీజేపీ నేతలు పలువురు కేంద్రానికి చెందిన వాళ్ళు పాల్గొనడం జరిగింది.

వైసీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఏపీ బీజేపీ నేతలు కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఏపీలో బెయిల్ పై ఉన్న నేతలు ఏ క్షణంలోనైనా.

బెయిల్ క్యాన్సిల్ అయి జైలుకు వెళ్లొచ్చు..

అని స్పష్టం చేశారు.దీంతో రాజకీయంగా "ప్రజాగ్రహ" సభ ఏపీలో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

ఈ క్రమంలో వైసిపి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి "ప్రజా గ్రహా" సభ పై మండిపడ్డారు.

బీజేపీలో ఉన్న టీడీపీ ఏజంట్లే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని.దీని వెనక ఉన్నది చంద్రబాబేనని ఆరోపించారు.మామూలుగా ఏపీలో బీజేపీ క్రియాశీలకంగా పని చేసిన సందర్భాలు లేవు కానీ ఎప్పుడైతే టిడిపి నుండి బీజేపీ లోకి కొంతమంది వెళ్లారో వాళ్ల వల్ల క్రియాశీలకంగా ఈ విధంగా బిజెపి రాణిస్తుందని సజ్జల అన్నారు.

ఒక్క బిజెపిలో మాత్రమే కాదు జనసేన పార్టీలో కూడా చక్రం తిప్పుతూ ఉంది టిడిపికి చెందిన వాళ్లే అని చెప్పుకొచ్చారు.రాజకీయంగా టిడిపి ఏ పాట పాడితే.

అదే పాట రాగం బిజెపి జనసేన పార్టీలు అందుకు ఉంటాయని సజ్జల ఎద్దేవా చేశారు.రామ రాజ్యం కావాలంటే వైసీపీ అనుసరించాలని.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక లేనట్టే ? 

సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీలో రామ రాజ్యం నడుస్తోందని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు