మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించి ఇటువంటి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి.!ఎందుకో తెలుసా?

హిందువుల్లో చాలా మంది త‌మ‌కు అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని త‌మ‌కు ఇష్ట‌మైన ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు.ఎందుకంటే ధ‌నానికి ఆమే అధిప‌తి.

ఎవ‌రికి ఐశ్య‌ర్యం సిద్ధించాల‌న్నా ఆమె అనుగ్ర‌హంతోనే అది జ‌రుగుతుంది.క‌నుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు.

అయితే చాలా మంది భ‌క్తులు త‌మ అనుకూల‌త‌లు, ఇష్టాల‌ను బ‌ట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న ల‌క్ష్మీ దేవి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజిస్తారు.కానీ మీకు తెలుసా.? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాల‌ను పూజిస్తే ధ‌నం రాద‌ట‌.పైగా ఉన్న ధ‌నం కూడా ఎలా వ‌చ్చిందో అలాగే పోతుంద‌ట‌.ఈ క్ర‌మంలో భక్తులు ఎలాంటి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.1.గుడ్ల‌గూబ తెలుసుగా.

దానిపై లక్ష్మీ దేవి కూర్చున్న‌ట్టుగా ఉండే బొమ్మ‌ను పూజించ‌కూడ‌ద‌ట‌.దీంతో అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ట‌.ధ‌నం వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు పోతుంద‌ట‌.2.తామ‌ర పూవుపై ల‌క్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్న‌ట్టుగా ఉన్న ఫొటోను పూజించాల‌ట‌.

Advertisement
Remove These Type Of Lakshmi Devi Photos From Your Home Because, Remove , Lakshm

దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట.ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ట‌.3.గ‌రుత్మంతునిపై విష్ణువుతోపాటు ల‌క్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధ‌నం ల‌భిస్తుంద‌ట‌.

అంతా మంచే జరుగుతుంద‌ట‌.

Remove These Type Of Lakshmi Devi Photos From Your Home Because, Remove , Lakshm

4.శేష‌త‌ల్పంపై విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మ‌ను పూజిస్తే అలాంటి వారి దాంప‌త్య జీవితం సుఖ‌మయంగా సాగుతుంద‌ట‌.5.కుబేరుని విగ్ర‌హం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో ల‌క్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వ‌ర్యాల‌ను క‌లిగిస్తుంద‌ట‌.6.పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌.

ధ‌నం కూడా బాగా స‌మ‌కూరుతుంద‌ట‌.

Remove These Type Of Lakshmi Devi Photos From Your Home Because, Remove , Lakshm
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

7.దీపావళి రోజున స్ఫ‌టిక శ్రీ‌ యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మీ మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి.దీంతో ఆ ఇంట్లో అంతా శుభ‌మే జ‌రుగుతుంది.8.ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవుల‌ను ఎక్కువగా వాడి పూజ చేయాల‌ట‌.దీంతో అనుకున్న‌ది జ‌రుగుతుంద‌ట‌.9.దీపావళి రోజున ల‌క్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంత‌రం ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి.

Advertisement

దీని వ‌ల్ల భక్తులకు అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ట‌.ఓం య‌క్షాయ కుబేరాయ వైశ్ర‌వ‌ణాయ ధ‌న‌ధాన్యాధిప‌త‌యే ధ‌న‌ధాన్య‌స‌మృద్ధిం మే దేహి దాప‌య స్వాహా.

తాజా వార్తలు