ఆ విషయంలో కాస్త తొందర పడ్డానంటున్న రాశీ...

ఇటీవలే టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించినటువంటి "వరల్డ్ ఫేమస్ లవర్" అనే చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద దారుణంగా డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

రాశి ఖన్నా, కేథరిన్ తెరెసా, ఐశ్వర్య రాజేష్, ఇంగ్లీష్ నటి ఇసాబెల్లా తదితరులు హీరోయిన్స్ గా నటించారు.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అనుకోకుండా పరాజయం పాలయింది.అయితే తాజాగా ఈ చిత్ర ఫలితాలపై భారీగా ఆశలు పెట్టుకున్నట్టు వంటి రాశి కన్నా ఇప్పుడు తెగ ఫీల్ అవుతుందట.

అంతేకాక కథల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తనకు ఓ గొప్ప గుణపాఠమని ఇప్పటికే పలు సందర్భాల్లో ఇన్ డైరెక్టుగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

అయితే సినిమా మాత్రం డిజాస్టర్ అయినప్పటికీ రాశికన్నా పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.అయినప్పటికీ ఎందుకు రాశీ కన్నా ఈ చిత్ర ఫలితాలపై సంతృప్తిగా లేకపోగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇప్పటికే తన సన్నిహితులతో అసంతృప్తి వ్యక్తం చేసిందట.

Advertisement

మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పలు జాగ్రత్తలు వహిస్తోంది ఈ అమ్మడు.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమాలు లేవు.కానీ కానీ కోలీవుడ్ కి సంబంధించినటువంటి రెండు చిత్రాల్లో నటిస్తోంది.ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో సరసన నటించేందుకు ఈ అమ్మడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు