సాయి పల్లవి, రానా 'విరాటపర్వం' ప్రివ్యూ

సాయి పల్లవి మరియు రానా ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది.

సినిమా ప్రారంభం అయిన కొన్ని రోజులకే హీరో రానా కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి.దాంతో అమెరికాలో రానా చాలా నెలల పాటు ఉండాల్సి వచ్చిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

తిరిగి వచ్చాక విరాటపర్వం సినిమాను పూర్తి చేయాలని భావించారు.అంతలోనే కరోనా ఎటాక్ అయ్యి షూటింగ్ కు అంతరాయం కలిగింది.

కరోనా బ్రేక్ ఇచ్చిన సమయంలో విరాటపర్వం సినిమాను పూర్తి చేశారు.దాంతో సినిమా ను విడుదల చేస్తాం అని అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా మొదలు అయ్యింది.

Advertisement

అప్పటి నుండి విరాట పర్వంను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ విషయం లో దర్శకుడు వేణు ఉడుగుల పలు సందర్బాల్లో క్లారిటీ ఇచ్చాడు.

ఆయన అన్నట్లుగానే థియేట్రికల్ రిలీజ్ కు విరాట పర్వం సిద్ధంగా ఉంది.చాలా భారీ గా అంచనాలు ఉన్న విరాటపర్వం సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు సాయి పల్లవి చాలానే కష్టపడింది.ఆమె తో పాటు రానా కూడా చాలా నే తిరిగాడు.

సినిమా జనాల్లోకి ఎంత వరకు వెళ్లిందో తెలియదు కాని విరాటపర్వం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.మీడియాలో విరాటపర్వం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సాయి పల్లవి ఉండటంతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వం అవ్వడం వల్ల ఈ సినిమా కు బజ్ ఎక్కువగా ఉంది.కనుక మంచి బిజినెస్ చేసింది.మరి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

రివ్యూ లు ఎలా ఉంటాయి అనేది చూడాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు