కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలంలో బద్దేనపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ర్టాంగ్‌ రూం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్ లు బుధవారం సంయుక్తంగా పరిశీలించారు.

స్ర్టాంగ్‌ రూంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు అన్ని వైపులా ఉండాలని సూచించారు.

సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఒకే చోట ఉన్నందున లే అవుట్ ప్రకారం రెండు నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ అన్నారు.లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన భద్రతకు సంబంధించి పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News