అక్కడ స్టూడియో ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..!

డిస్ట్రిబ్యూటర్ గా సత్తా చాటి నిర్మాతగా సక్సెస్ అయిన దిల్ రాజు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

తన బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియెన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూసేలా చేసుకున్నారు.

కంటెంట్ ఉన్న సినిమాలతో పాటుగా కమర్షియల్ సినిమాలను కూడా చేస్తూ వచ్చారు దిల్ రాజు.నిర్మాతగా ఒక రేంజ్ లో ఫాం లో ఉన్న దిల్ రాజు పరిశ్రమ కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు ఓ కొత్త స్టూడియో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. శంషాబాద్ ఏరియాలో దిల్ రాజు భారీ స్టూడియో ఒకటి నిర్మించాలని చూస్తున్నారట.

నిర్మాతగా తన టేస్ట్ ఏంటో తెలియచేస్తూ వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న దిల్ రాజు స్టూడియో కూడా సినిమాలకు అన్ని ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారట.ఇప్పటికే తెలుగు సినిమాలే కాకుండ ఇతర పరిశ్రమలకు హైదరాబాద్ ఒక వేదిక అవుతుంది.

Advertisement

ఇదేదారిలో దిల్ రాజు కూడా భారీ స్టూడియోని ప్లాన్ చేస్తున్నారట.ఇక దిల్ రాజు నిర్మించే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాం చరణ్, శంకర్ కాంబో సినిమా ఒకటి సెట్స్ మీద ఉంది.ఆ సినిమా భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు.

ఆ మూవీతో పాటుగా దళపతి విజయ్ తో వారసుడు సినిమా కూడా చేస్తున్నాడు దిల్ రాజు.ఈ రెండు సినిమాలతో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు దిల్ రాజు.

నిర్మాతగా ఎప్పుడూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చిన దిల్ రాజు ఈ రెండు సినిమాలతో నేషనల్ లెవల్ లో నిర్మాతగా తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు.ఈ రెండు హిట్ అయితే దిల్ రాజు రానున్న రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు